యూత్ కాంగ్రెస్ మంథని అసెంబ్లీ అధ్యక్ష బరిలో కుంభం మహేష్ రెడ్డి 

Written by telangana jyothi

Published on:

యూత్ కాంగ్రెస్ మంథని అసెంబ్లీ అధ్యక్ష బరిలో కుంభం మహేష్ రెడ్డి 

కాటారం ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో మంథని అసెంబ్లీ అధ్యక్షుడిగా మల్హర్ మండలం కుంభంపల్లి గ్రామానికి చెందిన కుంభం మహేష్ రెడ్డి బరిలో ఉన్నట్లు పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంథని అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆశీర్వదించి గెలిపించినట్లయితే అంద రికి అందుబాటులో ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మహేష్ రెడ్డి తెలిపారు. మంథని నియోజకవర్గ యువకుల అభిప్రాయం మేరకు ఆన్లైన్ ద్వారా నామినేషన్ దాఖలు చేశానని తెలిపారు. ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 5 వరకు జరిగే ఎన్నికల్లో పోటీలో ఉన్నట్లు తెలిపారు. ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ఎన్నుకోబడే ఈ అధ్యక్ష పోటీల్లో కార్యకర్తలు అందరూ తనకు మద్దతుగా యువకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రోత్సహించాలని, ఆన్లైన్ ద్వారా తమకు ఓటు వేయించి అత్యధిక మెజార్టీ వచ్చేలా చూడాలని మహేష్ రెడ్డి కోరారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now