జిల్లా ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కటుకం అశోక్

జిల్లా ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కటుకం అశోక్

జిల్లా ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కటుకం అశోక్

కాటారం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ అసోసియేషన్ కు నూతన కార్యవర్గా న్ని బుధవారం ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. భూపాలపల్లి జిల్లా శాఖ అధ్యక్షులుగా మహాదేవపూర్ కు చెందిన కటుకం అశోక్ ఏకగ్రీవంగా నియమితులయ్యారు. భూపాలపల్లి నూతన జిల్లా గా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కాటారం సబ్ డివిజన్ లోని ఐదు మండలాలకు చెందిన ఫర్టిలైజర్స్ అండ్ వ్యాపార స్తులకు మొదటిసారిగా జిల్లా శాఖ అధ్యక్ష పదవి లభించడం పట్ల ఈ ప్రాంత వ్యాపారస్తులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహాదేవపూర్ కు చెందిన కటుకం అశోక్ కాంగ్రెస్ పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కటకం మహేష్ ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్ష పదవికి ఎన్నికవడం పట్ల కాటారం సబ్ డివిజన్లోని వ్యాపారస్తులందరూ హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment