ఎన్నిసార్లు చెబుతారు ఇలా అయితే ఎలా..?

ఎన్నిసార్లు చెబుతారు ఇలా అయితే ఎలా..?

ఎన్నిసార్లు చెబుతారు ఇలా అయితే ఎలా..?

– కాలేశ్వరంలో పుష్కర పనులు కాకపోవడంపై కమిషనర్ ఆగ్రహం

– నేడు అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్ రావు

కాటారం, తెలంగాణ జ్యోతి : కాలేశ్వరంలో పుష్కర అభివృద్ధి పనులు పూర్తి చేస్తామంటూ ఎన్నిసార్లు సమీక్షలకు వచ్చిన ఇదే సమాధానం చెబుతున్నారని, ఎందుకిలా నిర్లక్ష్యం చేస్తున్నట్లు కమిషనర్ కాంట్రాక్టర్లు, అధికారులను అడిగారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాలేశ్వరంలో మే 15 నుండి 26 తేదీ వరకు జరిగే సరస్వతి నది పుష్కరాల పనులు ప్రారంభం నాటికి పూర్తి కాకుంటే కఠిన చర్యలు ఉంటాయని దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు హెచ్చరించారు. ఊహించింది.. చూసింది ఒకలా ఉందని, పనులు సకాలంలో పూర్తి చేయకపోతే కఠిన చర్యలు ఫేజ్ చేయడానికి సిద్ధంగా ఉండాలని.. ఆశించిన స్థాయిలో పుష్కర పనులు జరగడం లేదన్నారు. మూడు షిప్టులలో పుష్కర పనులు జరగాలని దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్ రావు ఆదేశించారు.  బుధవారం కాళేశ్వరం వద్ద జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా విఐపి ఘాట్‌లు, గోదావరి ఘాట్‌లు, టెంట్ సిటీ, గోదావరి హారతి ప్రాంతం, పుష్కర స్నానాల ప్రాంతం, 100 గదుల సత్రం, హెలిప్యాడ్ తదితర ఏర్పాట్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టుమారో అన్న పదం వాడొద్దని సూచించారు. ప్రతి రోజు చాలా ముక్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తున్నదని ప్రాధాన్యతను గమనించి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ లో సీఎం పుష్కరాల ఏర్పాటు పనులను అడిగి తెలుసుకున్నారని, బాధ్యత తీసుకోవాలని సూచించారని తెలిపారు. పనుల్లో జాప్యం జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో జరిగిన గోదావరి, కృష్ణా పుష్కరాలను దృష్టిలో. పెట్టుకుని భక్తులకు ఎలాంటి సమస్య రావొద్దని, భక్తులు సంతోషంగా వచ్చి పుష్కర స్నానాలు ఆచరించేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. పనులు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియ మించి విధులు కేటాయించి పర్యవేక్షణ చేయాలని వివరించారు. అదనపు సిబ్బందిని నియమించాలని సూచించారు. ప్రతి రోజు విఐపి, పీఠాధిపతులు వస్తారని తెలిపారు. మొట్టమొదటి సారి గా జాయ్ రైడ్, టెంట్ సిటీ ఏర్పాటు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ ను అభినందించారు. సివిల్ పనులు చాలా పెండింగ్ ఉన్నా యని, లోపాలు రావొద్దని తెలిపారు. రానున్న వారం రోజులు చాలా ముఖ్యమని చాలా కష్టపడి 24X7 పనులు జరగాలని ఆదేశించారు. దేవాదాయ శాఖ పనులు నత్తనడకన జరుగు తున్నాయని, నిద్రావస్థలో ఉందని అసంతృప్తి వ్యక్తం చేసి చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల భూమిని లీజుకు తీసుకుని విఐపి ఘాట్ నుండి గోదావరి ఘాట్ వరకు తాత్కాలిక రహదారి నిర్మిస్తున్నారని, పుష్కరాల ప్రాధాన్యత గుర్తించి భూమి ఇచ్చిన రైతులను అభినందించారు. రెండు రోజుల్లో మంత్రి వస్తున్నారని, షేప్ మారాలని ఆదేశించారు. పారిశుధ్యం అద్వాన్నంగా ఉందని జడ్పి సీఈఓ పర్యవేక్షణ చేయాలని, పారిశుద్ధ్య పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యహరిస్తున్నారని సమన్వయంతో ఉండాలని సూచించారు. గోదావరి, కృష్ణా పుష్కరాలను విజయవంతం చేశామని అదే స్ఫూర్తితో సరస్వతి పుష్కరాలను దిగ్విజయంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. రోడ్లు మరమ్మతులు చేయాలని, హెలిప్యాడ్ కో ఆర్డినేట్స్ పక్కాగా ఇవాలని సూచించారు. షవర్ పనులు పెండింగ్ ఉన్నాయని, అలాగే గోదావరిలోకి భక్తులు వెళ్లకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రమాద హెచ్చరికల బోర్డ్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. మరుగుదొడ్లు చాలా బాడ్ కండిషన్ లో ఉన్నాయని వేగం పెంచాలని తెలిపారు. పుష్కరాలను మోడల్ గా చేయాలని ఇతర రాష్ట్రాల కు ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాలు నుండి ప్రజా ప్రతి నిధులు, న్యాయ వాదులు, భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఫుడ్ కోర్టు, స్టాళ్లు, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. 12 రోజులు పాటు సందడిగా పండుగ వాతావరణంలో పుష్కరాలు జరగాలని ఆదేశించారు. విఐపి ఘాట్ రోడ్డు. బారికేడింగ్ చేయాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీములు ఏర్పాటు చేయాలని, పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. అన్ని రోడ్లు మరమ్మతులు చేసి గుంతలు లేకుండా పూడ్చాలని పేర్కొన్నారు. ఇరిగేషన్, పీఆర్, ఆర్ డబ్ల్యూఎస్, దేవాదాయ ఇంజినీరింగ్ శాఖల అధికారుల విధులు చాలా ముఖ్యమైనవని తెలిపారు. పుష్కరాలు పూర్తి అయ్యే వరకు అధికారులకు, సిబ్బందికి ఎలాంటి సెలవులకు అనుమతి లేదని, జిల్లా కలెక్టర్ అనుమతి మలేకుండా కార్యస్థానం విడిచి వెళ్ళొద్దని, అంకితభావంతో పని చేయాలని తెలిపారు. ప్రతి రోజు 5 వేల మందికి ఉచిత అన్నదానం చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు.  జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ 15వ ముఖ్యమంత్రి వస్తున్నారని, సరస్వతి మాతా విగ్రహం ప్రారంభోత్సవం, పుష్కర స్నానం, దర్శనం, హారతి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. గ్రాండ్ మానర్ లో చేయాల్సిన అవసరం ఉందని, పారిశుధ్యం, మంచి నీరు, మరుగుదొడ్లు, రహదారుల మరమ్మతులు, విఐపి ఘాట్ నుండి గోదావరి ఘాట్ వరకు రహదారికి గ్రావెల్ వేయాలని తెలిపారు. ఇన్సినిరేటర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. 5 సెక్టార్లు, 18జోన్లు గా విభజించి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేం దుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గోదావరిలో వైద్యుద్దీ కరణ చేయాలని తెలిపారు. గోదావరిలో వ్యర్దాలు తొలగించి పరిశుభ్రం చేయాలని తెలిపారు. హారతి కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి,మంత్రులు పాల్గొననున్నందున ఏర్పాట్లు చేయాల ని ఆదేశించారు. నోడల్ అధికారులు నియామకం ద్వారా పనులు పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. 12 మే వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. విఐపి ఘాట్ వద్ద విఐపిలకు షవర్స్, బట్టలు. మార్చుకునే గదులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. హారతి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలు వీక్షించేందుకు వీలుగా పట్టణంలోని ప్రదాన కూడళ్ళులో ఎల్ ఈ డి స్క్రీన్స్ ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఎస్పి కిరణ్ ఖరే మాట్లా డుతూ మంగళవారం సచివాలయంలో సమావేశం నిర్వహించి మంత్రులు దిశానిర్దేశం చేసారని, పుష్కరాలు మన రాష్ట్ర పండుగ అని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదని చెప్పకుండా రేయింబవళ్లు అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి పుష్కరాలను విజయ వంతం చేయాలని సూచించారు. ఏర్పాట్లు చేయడం మనందరి భాద్యతని ఏ ఒక్కరిదో భాద్యత కాదని టీము వర్కు గా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, దేవాదాయ శాఖ ఆర్జేసి రామ కృష్ణారావు, ఇరిగేషన్, పీఆర్, ఆర్ డబ్ల్యూఎస్, దేవాదాయ, విద్యుత్తు, వైద్యఆరోగ్యశాఖ, డిఆర్డీఓ, సమాచార శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment