అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత
– రెండు వాహనాలు స్వాధీనం, ఐదుగురు అరెస్టు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం టేకుల బోరు గ్రామం వద్ద నమ్మదగిన సమాచారంతో పోలీసులు వాహనాలు తనిఖీ చేయగా అక్రమం గా పశువులను, తరలిస్తున్న రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వెంకటాపురం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కే.తిరుపతిరావు కథనం ప్రకారం.. శనివారం వేకువ జామున 5గంటల సమయంలో అక్రమంగా పశువులు తరలిస్తున్నట్లు సమాచారం మేరకు రెండు వాహనాలను పట్టుకున్నామన్నారు. రెండు వాహనాల్లో ఉన్నటువంటి 44 పశువులతో సహా వాహనాలను స్వాధీనం చేసుకొని 5 గురుపై కేసులు నమోదు చేసి పశువులను గోశాలకు తరలించినట్లు తెలిపారు.