ప్రైవేటు వద్దు.. ప్రభుత్వ బడి ముద్దు…
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రంలో లైబ్రరీ మూమెంట్ వ్యవస్థాపక సభ్యుడు ధూపటి సతీష్ శనివారం నిర్వహించిన లైబ్రరీ మూమెంట్ ప్రోగ్రాం కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలే ముద్దని అన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలలో చదివే విద్యార్థులకు తమ వంతు బాధ్యతగా నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.ప్రభుత్వ పాఠశాలలు ప్రతీ ఒక్క పేద వీద్యార్థుల జీవీతంలో వెలుగు నింపే గుడని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ విష్ణు, రిటైర్డ్ ఐపీఎస్ ఉమాపతి, అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ సతీష్ కుమార్ పెండ్యాల, లైబ్రరీ మూమెంట్ సభ్యులు పాల్గొన్నారు.