అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం
రూ. లక్ష ఆస్తి నష్టం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వీరభద్రావరంలో ఆదివారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదం లో పూరీళ్ళు పూర్తిగా దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. పేద కుటుంబానికి చెందిన బందా లక్ష్మి ఇంటి వద్ద లేని సమయంలో ఒక్కసారిగా మంటలు అంటుకొని చెలరేగాయి. వేసవి కాలం కావడంతో మంటలు వేడి కారణంగా సామాన్లు బయటికి తీసే అవకాశం లేకుండా పోవడంతో కట్టుబట్టలతో నిరాశ్యుల య్యారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెంద కుండా గ్రామస్తులు అదుపులోకి తెచ్చారు. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. తమ ఆదివాసి కుటుంబాన్ని ఆదుకోవాలని అగ్ని బాధిత కుటుంబం అధికారులకు విజ్ఞప్తి చేశారు.