మృతుడి కుటుంబానికి సహాయం

మృతుడి కుటుంబానికి సహాయం

కాటారం, తెలంగాణ జ్యోతి : కాటారం మండలంలోని పోతుల వాయి గ్రామంలో చల్లా దేవేందర్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ గా కాంగ్రెస్ నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు ఆత్మహత్యకు పాల్పడిన చల్ల దేవేందర్ కుటుంబానికి ఇబ్రహీం పల్లి గ్రామానికి చెందిన సయ్యద్ అలీమ్, గ్రామ యూత్ అధ్యక్షుడు మంతెన రాకేష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంతెన సుధాకర్, పట్టి శ్రావణ్ లు రీ 2500 నగదు,50 కేజీల బియ్యాన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు షేక్ షఫీ చేతుల మీదుగా ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో మంతెన నరేష్, మంతెన శ్రీను, దయ్యపు రమేష్, పొలం శ్రీకాంత్, గర్రెపల్లి సుధాకర్ పాల్గొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment