నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సహాయం

నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సహాయం

– దాతల సేవలు మరువలేనిది

– సహాయనిది అధ్యక్షుడు అబ్బు సతీష్

తెలంగాణజ్యోతి,కన్నాయిగూడెం:టూరునాగారం మండ లం శంకరరాజుపల్లి గ్రామానికి చెందిన మంతెన మానస, సుమన్, వారి 3 ఏళ్ల కుమారుడు గగన్‌లు పాము కాటుకు గురై గగన్‌ మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గగన్ గురువారం ఉదయం 6:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. మంతెన సుమన్ ముప్పనపల్లి సహాయనిధి సహాయం కోరారు. దాతల సహకారంతో, దహన సంస్కారాల కోసం ఎంజీఎం ఆసుపత్రిలో 10 వేల రూపాయలు అందజేశారు. కార్యక్రమం లో సహాయ నిధి సభ్యుడు ఎండి ఫైజుద్దీన్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment