చీకుపల్లి వద్ద విస్తృతంగా వాహనాలు తనిఖీలు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చీకుపల్లి వద్ద జాతీయ రహదా రిపై విస్తృతంగా వాహనాలు తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహిం చారు. వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ ఆధ్వర్యంలో వచ్చే పోయే వాహనాలను నిశితంగా తనిఖీలు నిర్వహించి, అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని రాబ ట్టారు. వాజేడు సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రుద్ర హరీష్ తనిఖీల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మద్యం సేవించి వాహ నాలు నడపరాదని, పరిమిత సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకోవాలని, ప్రతి ఒక్కరు బండి కాగితాలు, లైసెన్సులు కలిగి ఉండాలని, ఈ సందర్భంగా ఇంధన శకట వాహన దారులకు అవగాహన కల్పిస్తూ, శకట చోథకులకు రోడ్డు ప్రయాణ భద్రత అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వాజెడు సబ్ ఇన్స్పెక్టర్ రుద్ర హరీస్ వాజేడు పి.ఎస్. సివిల్ పోలీస్ సిబ్బంది, సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు వాహనాల తనిఖీల కార్యక్రమంలో పాల్గొన్నారు.