ఎన్  హెచ్ పై గుంతలు పూడ్చిన ఎటూరునాగారం ఎస్సై తాజుద్దీన్

ఎన్  హెచ్ పై గుంతలు పూడ్చిన ఎటూరునాగారం ఎస్సై తాజుద్దీన్

ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి 163వ జాతీయ ప్రధాన రహదారి పై ప్రమాదకరంగా మారిన గుంతలను సోమవారం ఏటూరు నాగారం ఎస్సై తాజుద్దీన్ స్వయంగా గుంతలు పూడ్చి వేశారు. ఎస్సై స్వయంగా గుంతలు పూడ్చి వేస్తుం డడంతో ప్రధాన రహదారి మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు పోలీసుల సేవలను కొనియాడుతూ శభాష్ పోలీస్ అంటూ అభినందించారు. ఈ మార్గం లో ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడడంతో రాత్రిపూట ప్రయాణించే వాహనాలు ప్రమాదకరంగా మారాయి. గుంతలను గమనిం చక పోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగిన సంఘటనలు అనేకంగా నేలకొన్నాయి. వాహన దారులు అతి వేగంగా, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, రోడ్లపై ప్రమాదకరంగా ఏర్పడిన గుంతలను గమనించి నిదానంగా వెళ్లాలని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పకుండా ధరించాలని వాహనదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,  గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment