దత్తాత్రేయ పూజలు చేసిన దుద్దిళ్ళ శ్రీను బాబు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో దత్త నవరాత్రుల సందర్భంగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిళ్ళ శ్రీను బాబు ప్రత్యేక పూజలు అభిషేకా లను నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో సతిసమేతంగా చండి యాగంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు దేవాలయానికి విచ్చేసి దత్తుని సేవలో తరించారు. అనంతరం శ్రీను బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరు పై చూపాలని వేడుకున్నట్లు తెలిపారు.