రంజాన్ తోఫా కిట్ల పంపిణీ
కన్నాయిగూడెం, తెలంగాణ జ్యోతి : రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న తోఫా కిట్లను రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు కన్నాయిగూడెం మండల కాంగ్రెస్ నాయకులు మైనారిటీ సోదర సోదరీమణులకు పంపిణీ చేశారు. లక్ష్మిపురం, దేవదుల, గుర్రావుల, ముప్పనపల్లి, చింతగూడెం గ్రామాల్లో లబ్ధిదారులకు కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.డి. అప్సర్ పాషా, మండల ఇంచార్జ్ జాడి రాంబాబు, దుర్గం ప్రభాకర్, మైమూద్ తదితరులు పాల్గొన్నారు.






