కలిపాక గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం. 

కలిపాక గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం. 

– అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. 

– వెంకటాపురం ఎస్సై కే. తిరుపతిరావు. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం మారుమూల అటవీ ప్రాంతమైన తిప్పాపురం పంచాయతీ కలిపాక గ్రామంలో గురువారం ఉదయం వెంకటాపురం సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కే. తిరుపతిరావు ఆధ్వర్యంలో, కమ్యూనిటీ కాంటా క్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. వ్యవసాయ పనులు ఇతర పనులు కారణంగా గురువారం ఉదయాన్నే గ్రామస్తులకు ఇబ్బందులు లేకుండా కలిపాక గ్రామంలో సమావేశం నిర్వహించి, గిరిజను లకు అవగాహన కల్పించారు. గ్రామాల్లోకి వచ్చే అసాంఘిక శక్తులు , అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. గ్రామీణ యువత విథ్య , ఉద్యోగ ఉపాధి రంగాలలో ముందుకు సాగాలని కోరారు. ప్రభుత్వ గిరిజన సంక్షేమ పథకాలను, బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బడి వయసు పిల్లలను తల్లిదండ్రులు పాఠశాలలకు పంపించాలని, విద్య యొక్క ఆవశ్యకతను వివరించారు. భారీ వర్షాలు, గోదావరి వరదల సమయంలో వాగులలో చేపల వేటకు వెళ్ళవద్దని, అలాగే వరదల్లో ఈతలకు వెళ్ళరాదని తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, భవిష్యత్తులో సంభవించే గోదావరి వరదలు, భారీ వర్షాలపై, ప్రభుత్వ శాఖల సహాయ సహకారాలు పొందటంలో కూడా గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అలాగే సైబర్ క్రైమ్ నేరాలు, నేరగాళ్ల వలలో పడరాదని గిరిజనులకు ఎస్.ఐ. తిరుపతిరావు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సివిల్ పోలీస్ తో పాటు, సిఆర్పిఎఫ్ సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment