ఇంటర్ ప్రథమ సంవత్సర అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
టిజిఎస్ డబ్ల్యూఆర్ఎస్ డిసిఓ డాక్టర్ ఎ వెంకటేశ్వర్లు
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ఐఐటి, నీట్, ఇంజనీరింగ్ సీట్లను సాధించడంలో రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ కళాశాలలకు దీటుగా నడుస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఉన్న ఏడు ప్రీమియర్ సిఓఈ కళాశాలలో 31 సిఓఈ కళాశాలలో 21 నాన్ సీఓఈ కళాశాలలో ఎంపీసీ బైపీసీ సీఈసీ ఎంఈసిహెచ్ మరియు ఒకేషనల్ కోర్సుల్లో గల సీట్లను భర్తీ చేయుటకు గాను ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని టిజిఎస్ డబ్ల్యూ ఆర్ఎస్ డిసిఓ డాక్టర్ ఏ వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సెక్షన్లో 40 సీట్లు అందుబాటులో ఉంటాయని. ఎస్సీకి 30 సీట్లు, ఎస్టీకి రెండు సీట్లు, బీసీకి ఐదు సీట్లు, మైనారిటీకి ఒక సీటు, ఓసి కి రెండు సీట్లు కేటాయించబడునని తెలిపారు. విద్యార్థులకు పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రీమియర్ సిఓఇ, సిఓఇ, నిన్ సిఓఇ కళాశాలలకు సీట్లు కేటాయించ బడతాయన్నారు. పీహెచ్సీ (అంగవైకల్యం) ఆర్ఫాన్ (అనాధ) విద్యార్థులకు కూడా మూడు శాతం సీట్లు కేటాయించ బడినాయని తెలిపారు. రూపాయలు 200 రుసుమును చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని పేద, దళిత, గిరిజన, వెనుకబడిన కుటుంబాల విద్యార్థులు సద్వినియోగం చేసుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోగలన్నారు. ఆన్లైన్లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ 15.5.2025 అని గమనించగలరని తెలిపారు. ములుగు జిల్లా లో బాలురకు జాకారం, ఏటూరునాగారం కళాశాలలు బాలి కలకు ములుగు కళాశాల అందుబాటులో ఉన్నాయని ములుగు డిసిఓ టిజిఎస్ డబ్ల్యూఆర్ఎస్ ప్రిన్సిపాల్ డా.ఏ. వెంకటేశ్వర్లు తెలిపారు.