నాంచారమ్మ జాతరకు భక్తులు తరలిరావాలి

నాంచారమ్మ జాతరకు భక్తులు తరలిరావాలి

నాంచారమ్మ జాతరకు భక్తులు తరలిరావాలి

– పనులను ప్రారంభించిన తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం

వెంకటాపూర్,తెలంగాణజ్యోతి : నాంచారమ్మ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి దేవతకు మొక్కులు చెల్లించు కోవాలని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు కేతిరి భిక్షపతి పిలుపునిచ్చారు. శుక్రవారం వెంకటా పూర్ మండలంలోని రామంజపురం శివారులో గల నాంచారమ్మ ఆలయ ప్రాంగణంలో తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం ములుగు జిల్లా ఆధ్వర్యంలో నాంచారమ్మ జాతర జరుపుటకు ఏర్పాట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కేతిరి బిక్షపతి మాట్లాడుతూ రామానుజాపురంలో 812 సంవ త్సరాలక్రితం కాకతీయరాజులు నిర్మించిన ఎరుకల నాంచారమ్మ దేవాలయంలో జాతరను 12 మే, 2025 వైశాఖ శుద్ధ పౌర్ణమి సోమవారం రోజున అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నామన్నారు. డప్పు సప్పులతో, తాళ మేలాలతో, బోనాలు, శివసత్తులతో ఊరేగింపుగా అమ్మవారి జాతర జరుగుతుందన్నారు. నాంచారమ్మ జాతరకు ఆదివాసి ఎరుకల కులస్థులతోపాటు భక్తులు భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ జాతరకు రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పివో చిత్రామిశ్రాలను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం ములుగు జిల్లా ఉపాధ్యక్షుడు పల్లకొండ భాస్కర్, మేడ బంగారయ్య, సాళ్ళ బాబు, ప్రధాన కార్యదర్శి పల్లకొండ ఎల్ల స్వామి, కోశాధికారి పాలకుర్తి సురేష్, సహాయ కార్యదర్శులు దేవర్ల పరమేష్, కేతిరి అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment