జిల్లా ఆస్పత్రిలో స్టాఫ్ నర్సు, సిబ్బంది కొరత తీర్చండి
– కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ యూనియన్ జిల్లా అద్యక్షుడు రమేష్
– మంత్రి సీతక్కకు వినతి
ములుగు : ములుగులోని జిల్లా ఆస్పత్రిలో సరైన స్టాప్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఉన్న కొద్ది స్టాఫ్ తో రోగులకు సరైన సేవలు అందించలేక పోతున్నామని తెలంగా ణ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసి యేషన్ జిల్లా అధ్యక్షుడు గాదె రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్కకు శనివారం వినతిపత్రాన్ని అందజేశారు. 317జీవోతో జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న 11మంది స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది బదిలీపై వెళ్లారన్నారు. జోన్ల పరిధిలోకి వెళ్లేసరికి జిల్లా ఆస్పత్రిలో వచ్చే రోగులకు సరైన సేవలు అందించలేక పోతున్నామ న్నారు. ప్రస్తుతం 10మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది మాత్రమే ఉన్నారన్నారు. 75పడకల ఆస్పత్రిలో ఐసీయూ సేవలు కూడా కొనసాగుతున్నాయని, టీహబ్, రేడియాలజీ హబ్ లలో కూడా సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతీరోజు ఓపీ 400లమంది ఐపీకి 100మంది వస్తున్నార న్నారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కొరతతో ఇబ్బం దులు పడుతున్నామని, సరైన సిబ్బందిని వెంటనే జిల్లా ఆస్పత్రికి అలాట్ చేయాలని కోరారు. ములుగు నుంచి వెళ్లిన స్టాఫ్ నర్సులను వెంటనే తిరిగి రప్పించాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.