హనుమకొండలో కారుతో సహా నూగూరు వెంకటాపురం యువకుడి అదృశ్యం. 

హనుమకొండలో కారుతో సహా నూగూరు వెంకటాపురం యువకుడి అదృశ్యం. 

హనుమకొండలో కారుతో సహా నూగూరు వెంకటాపురం యువకుడి అదృశ్యం. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన నూగూరు వెంకటాపురం పట్టణానికి చెందిన చిడెం సాయి ప్రకాష్ అనే యువకుడు ఈనెల 15వ తేదీ మంగళవారం సాయంత్రం వెంకటాపురం నుండి తన బంధువులను హనుమకొండలోని ఒక ప్రైవేటు వైద్యశాలకు వైద్యం కోసం తన కారులో తీసుకువెళ్లి అదృశ్యమయ్యారు. అయితే హాస్పటల్లో జాయిన్ చేసిన అనంతరం ఫోన్ కొంత సమయం పాటు రింగ్ అయి, తర్వాత నో రిప్లై ఆన్సర్ తో బుధవారం నుండి స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు సాయి ప్రకాష్ బంధువులు తెలిపారు. అదృశ్యమైన సాయి ప్రకాష్ వెంకటాపురంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ను ఏర్పాటు చేసి అనేక పర్యాయాలు  వివిధ ప్రభుత్వ శాఖలతో సత్సం బంధాలు కలుపుకొని అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తదానంతో ప్రాణదానం చేసీ ఆపద్బాంధవుడుగా ప్రాణదాతగా పేరుగాంచారు కాగ తన సొంత కారును అప్పుడప్పుడు కిరాయిలకు తానే డ్రైవర్గా వేళ్తూ పనులు బిజీ ఉన్నప్పుడు డ్రైవర్ను పెట్టుకొని టాక్సీ నిర్వహించేవాడు. వెంకటాపురంలో కార్యాలయం ఏర్పాటు చేసుకొని ప్రజల సౌకర్యార్థం చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రజల ద్రాహార్తిని  తీర్చే వాడు. సాయిప్రకాశ్ మంగళవారం సాయంత్రం హనుమకొండ ప్రైవేటు వైద్యశాలకు తన సొంత కారులో తానే డ్రైవ్ చేస్తూ బంధువులను తీసుకువెళ్లి అదృశ్యం అవటం పట్ల వెంకటాపురంలో చర్చనీయాంశమైంది. ఈ మేరకు వెంకటాపురం లోని వారి బంధువులు వెంకటాపురం పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేశారు. అయితే అదృశమైంది హనుమకొండ కాబట్టి, అక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని స్థానిక పోలీస్ అధికారులు చెప్పటంతో హన్మకొండ వెళ్లి అక్కడ పోలీస్ స్టేషన్లో సాయి ప్రకాష్ సోదరుడు పిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ తో ఉండటం తో తమ కుమారుడు సాయి ప్రకాష్ ఏమైపోయాడోనని వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సాయి ప్రకాష్ కనిపించక 5 రోజులు కావస్తున్న శనివారం వరకు కూడా ఎటువంటి సమాచారం అందుబాటులోకి రాలేదు. చిడెం సాయి ప్రకాష్ ఎక్కడ ఉన్నా క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని, సాయి కుటుంభం, రక్తదాతలు, వారి అభిమానులు, స్నేహితులు, బంధు మిత్రులు  కోరుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment