వృద్ధురాలి హత్య కేసులో నిందితుడి అరెస్ట్

వృద్ధురాలి హత్య కేసులో నిందితుడి అరెస్ట్

వృద్ధురాలి హత్య కేసులో నిందితుడి అరెస్ట్

కాటారం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదివారం పేట గ్రామంలో ఇటీవల వృద్ధురాలు ఓడేటి మల్లక్కను హత్య చేసిన కేసులో నిందితుడు మొరలే శివ @ శివాజీ ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు కాటారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున రావు సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో తెలిపారు. నిందితుడు ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం బారెగూడ గ్రామంనకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 13 వ తేదీన మృతురాలు ఓడేటి మల్లక్క కూతురు ముల్కల శ్రీదేవి ఫిర్యాదిదారు ఇచ్చిన పిటిషన్ మేరకు కాటారం పోలీస్ లో కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఎస్పీ కిరణ్ ఖరే , కాటారం డిఎస్పి జి రామ్మోహన్ రెడ్డి ఆదేశాలతో కాటారం, మహాదేవ పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లు నాగార్జున రావు, రామచందర్రావు, ఎస్ ఐ లు అభినవ్,శ్రీనివాస్, సిబ్బంది నేర స్థలానికి వెళ్లి హత్యకు సంభందించిన వివరాలను సేకరించి, తదుపరి క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్ బ్యూరో మరియు డాగ్ స్క్వాడ్, పరిశీలించి నేరానికి సంబందించిన వస్తువులను సిజ్ చేశారు. కేసు విచారణలో భాగంగా శక్రవారంపై నిందితుడు మోరలే శివ @ శివాజీనీ అదుపులోకి తీసుకొని విచారించగా నేరమును అంగిక రించారు. గత కొద్ది రోజుల క్రితం మృతురాలి కోడలు అయిన శ్రీలత అనే మహిళలతో నిందితుడికి పరిచయం అయింది, వాళ్ళు ఇద్దరు కలిసి కాగజ్ నగర్ లో 3 సంవత్సరాల క్రితం  కొన్ని రోజుల పాటు సహజీవనం చేశారు. తరువాత నిందితుడు శివ వేదింపులు భరించలేక శ్రీలత అతన్ని వదిలి కాటారం మండలం ఆదివారంపేట కు వచ్చింది. తరువాత నిందితుడు శ్రీలత ను ఎలాగైనా కలువాలనే ఉద్దేశంతో ఆదివారంపేటకి వచ్చి శ్రీలతను పలు మార్లు కలుద్దాం అని అడుగగా ఆమె నిరాకరించినది, అందుకు నిందితుడు కక్ష్య సాధింపు చర్యల్లో శ్రీలత వాళ్ళ అత్త ని చంపితే ఆస్తి కోసమే శ్రీలత ఆమె ను చంపింది అని ఆ కేసు ఎలా అయిన శ్రీలత మీదకే వస్తుందని, ఆమెను ఏ రకంగా అయిన కేసు లో ఇరికించి జైలు కి పంపాలనే ఉద్దేశంతో 12 వ తేదీన రాత్రి సుమారు 10:30 గంటలకు నిందితుడు శివ అనుకున్న ప్రకారమే మృతు రాలి ఇంటికి వెళ్లి, ఆమె నిద్రపోతున్న సమయంలో ఆమెను చంపాలనే ఉద్దేశం తో అక్కడ సెల్ఫ్ లో ఉన్న గొడ్డలి తో మరలేసి ఆమె తలపై పలుమార్లు చనిపోయే వరకు కొట్టిగా, మంచంలోనే రక్తం కారుతూ మృతురాలు చనిపోగా, నిందితుడు ఘటన స్థలం నుంచి, గొడ్డలి అక్కడే పడేసి పారిపోయాడు. శుక్రవారం తెలిసిన సమాచారం మేరకు కాటారంలోని పత్తి మిల్లు వద్ద అదుపులోకి తీసుకుని విచారించి, అరెస్ట్ చేసి నిందితుడినీ రిమాండ్ కు పంపించినట్లు తెలిపారు. ఈ కేసును చేధించిన కాటారం డి ఎస్ పి రాం మోహన్ రెడ్డి, సిఐలు నాగార్జున రావు, రాం చందర్ రావు, ఎస్ ఐ లు అభినవ్, శ్రీనివాస్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ కిరణ్ ఖరే అభినందించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment