అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం 

Written by telangana jyothi

Published on:

అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం 

తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మండల కేంద్రంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో బుధవారం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.అంతకుముందు గ్రామంలోని భక్తులు పెద్ద ఎత్తున తలంబ్రాలను మేళ తాళాలతో రామాలయానికి తీసుకొచ్చారు. అర్చకులు వేదమంత్రాల మధ్య మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని 12 గంటల ఐదు నిమిషాలకు ముక్కామల వెంకట్ నారాయణ శర్మ ,మణికంఠ శర్మ ,నాగేశ్వరరావు లు శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించారు. పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగింది.స్థానిక ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.కళ్యాణ మహోత్సవంలో చిన్నారులు ఆటపాటలకు అలరించారు.ఆంజనేయ స్వామి మాలాధారణ స్వాములు,రామాలయం కమిటీ సభ్యులు,భక్తులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now