కార్మికుల శ్రమను గుర్తించాలి
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రంలోని సామాజిక ఆసుపత్రిలో మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సిఐటియు కార్మికుల ఆధ్వర్యంలో జెండాను ఆవిష్క రించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హెల్త్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కన్వీనర్ నర్సింగరావు హాజరై మాట్లాడుతూ కార్మికుల శ్రమను గుర్తించి, శ్రమకు తగ్గ ఫలితం చేకూర్చే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు స్వప్న, లిఖిత, సిబ్బంది గంగాధర్, సునీల్, రాము, నర్సింహారావులు పాల్గొన్నారు.