ప్రజా సమస్యల పరిష్కారమే ద్వేయంగా గ్రామసభల ఏర్పాటు
– నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన పోలీస్ శాఖ
– ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్, ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయల ఆదేశానుసారం, ఏటూరు నాగారం సీఐ అనుముల శ్రీనివాస్ సూచనల మేరకు మండలంలోని రామన్న గూడెంలో గురువారం స్థానిక ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ప్రజా శ్రేయస్సు కోసం ప్రతిరోజు గ్రామాల వారీగా గ్రామసభలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకొని ప్రజా సమస్యల పరిష్కారమే ద్వేయంగా పోలీస్ శాఖ సేవలను అందిస్తుందని తెలిపారు. రామన్నగూడెంలో సైడు కాలువలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమ దృష్టికి తీసుకురావడంతో వెంటనే మండల ఎంపీడీవో రాజ్యలక్ష్మి తో మాట్లాడి దగ్గరుండి సైడ్ కాలువలు శుభ్రం చేయించి సమస్యను పరిష్కారం అయ్యేలా చూసారు. గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామస్తులు కోరగా సంబంధిత అధికారులతో మాట్లాడి మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీలు కాకుండా మరమ్మత్తు పనులు చేపట్టి చర్యలు చేపట్టడం జరుగుతుందని హామీ ఇచ్చారు. గ్రామంలో సత్వర సేవలు అందించడంలో ప్రతి ఒక్కరూ ముందుండాలని అన్నారు. వర్షాకాలంలో కరకట్ట కొట్టుకుపోయి గోదావరి వరద నీరు గ్రామాల్లోకి చేరి ప్రతి ఏడాది ముప్పు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సమస్యను విన్నవించారు. వరదల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయి పోలీస్ శాఖ పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం కరకట్ట నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు చేయడం జరుగుతుందని తెలిపారు. పనులు పూర్తి అయ్యేంత వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్షణ కల్పించడం జరుగు తుందని తెలిపారు. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకొని పరి ష్కారం కోసం కృషి చేస్తున్న పోలీస్ శాఖ సేవలు అభినందనీ యమని ప్రజలు పోలీసుల సేవలను కొనియాడుతున్నారు. గ్రామ సభల నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ కు గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామన్నగూడెం గ్రామ ప్రజలు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.