పారదర్శక నీతితో పాలన సాగిస్తాం

పారదర్శక నీతితో పాలన సాగిస్తాం

– ధన్వాడ గ్రామ సభలో మంత్రి శ్రీధర్ బాబు 

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: పారదర్శకంగా నీతివంత మైన పాలన సాగిస్తామని రాష్ట్ర సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు వెల్లడించారు. శనివారం జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం స్వగ్రామమైన ధన్వా డ గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన ప్రజా పాలన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేద ప్రజల్లో తాము కోరుకున్న పరిపాలన జరుగుతుందని ఆశించిన ప్పటికీ, గత భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వ పాలనలో జరగ లేదని, దాంతో ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలందరూ ఆకాంక్షిం చి, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజా పరిపాలన కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి రూపొందించారని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడిం చారు. పేద ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. ప్రభుత్వం ఏర్పాటై నేటికీ 21 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా మేని ఫెస్టోలో ప్రకటించిన విధంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయాన్ని కల్పించామని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. మిగతా 5 గ్యారంటీ పథకాలను అర్హులైన ప్రజలం దరికీ అందించాలనే సదాశయంతో ఈనెల 28 నుంచి వచ్చే నెల ఆరో తారీకు వరకు గ్రామ సభలను నిర్వహించి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి కుటుంబ పరమైన అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుందని అన్నారు గ్రామాల్లోని మౌలిక సదుపాయా ల కల్పనకు ప్రభుత్వం కార్యాచరణను చేపట్టిందని తెలిపారు. అవినీతి రహిత పరిపాలన అందించాలని, క్రింది స్థాయి సిబ్బంది నుంచి మొదలుకొని జిల్లా కలెక్టరేట్ల వరకు అధికారులు నీతివం తంగా, జవాబుదారితనంగా పనిచేయాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. గత ప్రభుత్వంలో తూతూ మంత్రంగా కొనసాగిన ట్లుగా అధికారులు వ్యవహరించవద్దని, ప్రజలకు ఇబ్బందులు కలిగించినట్లయితే సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజలు తమ సమస్యలను విన్నవించు కునేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు సామరస్య పూర్వకంగా మర్యాదపూర్వకంగా ప్రజలతో వ్యవహరించాలని కోరారు. సమస్య ల పట్ల జవాబుదారితనంతో పరిష్కారం అయ్యే వివరాలను వీలైతే లిఖితపూర్వకంగా దరఖాసుదారులకు తెలియజేయాల్సిన అవస రం ఉందని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సమస్య లను వివరించు దరఖాస్తులను సమర్పించాలని కోరారు. గ్రామ సభల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులు పారదర్శక జవాబు దారితనంతో ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో మండల పరిషత్ అధ్యక్షులు పంతకాని సమ్మయ్య, తహ సిల్దార్ నాగరాజు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మాలోత్ శంకర్ నాయక్, పంచాయతీరాజ్ డిఇ సాయిలు, ఏ ఈ అశోక్, ఆర్ డబ్ల్యు ఎస్ రాజశేఖర్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి పోలీసులు గౌరవ వందనం చేశారు. డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, సిఐ రంజిత్ రావు, ఎస్ఐలు అభినవ్, ప్రసాద్ బందోబస్తు నిర్వహించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “పారదర్శక నీతితో పాలన సాగిస్తాం”

Leave a comment