వెంకటాపురం ఉపసర్పంచ్ షేక్ షర్ఫుద్దీన్కు సన్మానం
వెంకటాపురం నూగూరు, డిసెంబర్ 19 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీలో బుధవారం జరిగిన ఎన్నికల్లో ఉపసర్పంచ్గా ఎన్నికైన షేక్ షర్ఫుద్దీన్ (సన్నీ)ను ముస్లిం పెద్దలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు సయ్యద్ అన్వర్తో పాటు ముస్లిం సభ్యులు పాల్గొని, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని, గ్రామపంచాయతీ అభివృద్ధికి తోడ్పడుతూ గ్రామ సమస్యల పరిష్కారంలో ముందుండి నడిపించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మహమ్మద్ ఉలిహెదర్, షేక్ అమీర్, సయ్యద్ బాబు, షేక్ అఫీజుద్దీన్, సయ్యద్ భాష తదితరులు పాల్గొన్నారు.






