వెంకటాపురం విద్యుత్ శాఖ ఏడీఈగా ఉమారావు బాధ్యతలు స్వీకరణ
వెంకటాపురం నూగూరు, నవంబర్ 25, తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం విద్యుత్ శాఖ సబ్ డివిజన్కి కొత్త అసిస్టెంట్ డివిజినల్ ఇంజనీర్గా బి. ఉమా రావు నియమితులయ్యారు. సోమవారం ఆయన పద్ధతిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈ విభాగంలో ఏడీఈగా పనిచేసిన స్వామి రెడ్డి జనగాం కు బదిలీ అయ్యారు. కొత్త ఏడీఈగా బాధ్యతలు చేపట్టిన ఉమా రావుకు వెంకటాపురం, వాజేడు విభాగాల విద్యుత్ శాఖ ఏఈలు హనుమాన్ దాస్, హర్షద్, సిబ్బంది ఫరీద్, దిలీప్, ఫాష సహా రెండు మండలాల ఉద్యోగులు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.






