జిల్లా ఎస్పీని కలిసిన టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు
కాటారం, జనవరి 03 (తెలంగాణ జ్యోతి): జిల్లా ఎస్పీని కలిసిన టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు నూతన సంవత్సరం 2026ను పురస్కరించు కుని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) నాయకు లు భూపాలపల్లి జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సిరిశెట్టి సంకీర్త్, జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్, భూపాలపల్లి పోలీస్ స్టేషన్ డీఎస్పీ సంపత్ రావు, సీఐ నరేష్ కుమార్, ఎస్సై సాంబమూర్తిలను వేర్వేరుగా కలిసి పుష్పగుచ్చా లు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం సతీష్ కుమార్, కార్యదర్శి గుజ్జ సారేశ్వరరావు, కోశాధికారి మండల రాంబాబు, బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ప్రవీణ్ కుమార్, కోశాధికారి ఏనుగుల భాస్కర్, మీడియా జిల్లా కన్వీనర్ పుల్ల సృజన్, జిల్లా కమిటీ సభ్యులు మంద జోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.






