సమాజంలో పాత్రికేయుల పాత్ర ఎంతో విలువైంది

సమాజంలో పాత్రికేయుల పాత్ర ఎంతో విలువైంది

– ములుగు డిఎస్పి రవీందర్ 

ములుగు ప్రతినిధి : నేటి సమాజంలో పాత్రికేయులు విలువ లతో కూడిన జర్నలిజం చేయాలని ములుగు డిఎస్పి రవీం దర్ అన్నారు. ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బానోతు వెంకన్న, గౌరవ అధ్యక్షుడు భూక్య సునీల్ లు ములుగు డి.ఎస్.పి రవీందర్ ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాం క్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా డిఎస్పి రవీందర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభు త్వానికి మధ్య వారధిగా జర్నలిస్టులు పనిచేయాలని, వార్త కథనాలు ప్రచురించే సమయంలో ఒకటికి రెండుసార్లు విష యాలను తెలుసుకొని అధికారులను సంప్రదించి వార్తలను ప్రచురించాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమ స్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి సమస్యల సాధనకు ప్రభుత్వానికి తోడ్పాటును అందించాలని అన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చి జర్నలిజం వృత్తికే వన్నె తెచ్చేలా పనిచేయాలని పేర్కొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment