ఆదివాసీల ఆత్మగౌరవం అస్తిత్వానికి ప్రతీకగా మేడారం జాతర

On: January 4, 2026 6:36 PM

ఆదివాసీల ఆత్మగౌరవం అస్తిత్వానికి ప్రతీకగా మేడారం జాతర

ఆదివాసీల ఆత్మగౌరవం అస్తిత్వానికి ప్రతీకగా మేడారం జాతర

చిలకలగుట్ట పవిత్రత కాపాడటం మన అందరి బాధ్యత.

పూజారులు – ఆదివాసి సంఘాలు – అధికారుల సమన్వయంతో జాతర విజయవంతం చేయాలి.

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.

ములుగు, జనవరి 4, తెలంగాణ జ్యోతి :  ఆదివాసీల ఆత్మగౌరవం అస్తిత్వానికి ప్రతీకగా మేడారం జాతర రూపు దిద్దుకుంటుందని , సమ్మక్క దేవత కొలువైన చిలకలగుట్ట పవిత్రత కాపాడటం మన అందరి బాధ్యత అని, పూజారులు – ఆదివాసి సంఘాలు – అధికారుల సమన్వయంతో జాతర విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఆదివారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్ లో శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర 2026 నిర్వహణపై మేడారం వన దేవతల పూజారులతో , ఆదివాసి సంఘాల నాయకులతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా లతో కలిసి అభిప్రాయాల సేకరణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర 2026 విజయవంతం చేయడానికి పూజారుల ఆదివాసి సంఘాల నాయకుల సహకారం ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. జాతర నిర్వహణ పై ఆదివాసి సంఘాల నాయకుల తమ అభిప్రాయాలను తెలుపాలని సూచించారు. వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలు గిరిజనుల రాజ్యాంగ బద్దంగా గిరిజనుల హక్కుల ప్రకారం నిర్వహించడానికి ఒక ప్రత్యేక పాలసీని రూపొందించాలని, జాతరకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాటు చేయాలని, భక్తులకు సేవలను అందించడానికి ఆదివాసి సంఘాల 500 యువకులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని, పూర్తిస్థాయిలో శాశ్వత ప్రతిపాదికన ఆదివాసీలతో కూడిన ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ పూజారుల , ఆదివాసి సంఘాల సలహాలు సూచనలు వారి సమన్వయం తో జాతర విజయవంతం చేస్తామని తెలిపారు. కోట్లాదిమంది భక్తుల విశ్వాసం మేడారం జాతర తరతరాలకు గుర్తుండిపోయేలా ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకుంటుందని, సమ్మక్క సారలమ్మ వారసులుగా గిరిజనులకు గుర్తింపు లభిస్తుందని, ఆదివాసి సంఘాలు వారి సభ్యుల వివరాలు అధికారులకు అందించాలని పేర్కొన్నారు.  చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను తీసుకవచేటప్పుడు ఆదివాసి యువజన సంఘాలు సమన్వయం పాటించాలని , వాలంటరీ సభ్యులకు మహిళలకు ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. జాతర సమయంలో ఇసుక లారీలను పూర్తిగా బంద్ చేయడం జరుగుతుందని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు దర్శనం ఏ విధంగా చేసుకోవాలనే అంశంపై ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్పీ మనన్ భట్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్డీఓ వెంకటేష్, ఐటీడీఏ ఏ పి ఓ వసంతరావు, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఆదివాసి సంఘాల నాయకులు, ఐటిడిఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసీల ఆత్మగౌరవం అస్తిత్వానికి ప్రతీకగా మేడారం జాతర

ములుగు హమాలీ కమ్యూనిటీ భవనం ప్రారంభం

ములుగు జిల్లా కేంద్రంలో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా సుమారు రూ.11 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన హమాలీ కమ్యూనిటీ భవనాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదివారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, హమాలీ కార్మికులు ఉదయం నుంచి పనుల్లో నిమగ్నమై మధ్యాహ్న సమయంలో విశ్రాంతి, భోజన అవసరాల కోసం అనువైన స్థలం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారికి సౌకర్యంగా ఉండేందుకు ఈ కమ్యూనిటీ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా అవసరాల మేరకు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, పంచాయతీ రాజ్ రాష్ట్ర డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, హమాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ములుగు హమాలీ సంఘం అధ్యక్షుడు రాజు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆదివాసీల ఆత్మగౌరవం అస్తిత్వానికి ప్రతీకగా మేడారం జాతర

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!