19న సీఎం టూర్ సక్సెస్ చేయాలి : రాష్ట్ర మంత్రి సీతక్క

On: January 10, 2026 6:17 PM

19న సీఎం టూర్ సక్సెస్ చేయాలి : రాష్ట్ర మంత్రి సీతక్క

19న సీఎం టూర్ సక్సెస్ చేయాలి : రాష్ట్ర మంత్రి సీతక్క

 మున్సిపాలిటీ ఎన్నికల్లో 20వార్డులు గెలుచుకోవాలి

ములుగు జిల్లా కేంద్రంలో ముఖ్య నాయకులతో సమావేశం 

ములుగు, జనవరి 10, తెలంగాణ జ్యోతి : అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగనున్న మేడారం మహాజాతర ప్రారంభోత్సవానికి ఈనెల 19న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయవంతం చేయడానికి కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమశాఖా మంత్రి సీతక్క స్పష్టం చేశారు. శనివారం ములుగు లోని క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మేడారంలో అభివృద్ధి పనులు చేపట్టగా పనులు పూర్తిచేసుకొని ముఖ్య మంత్రి చేతులమీదుగా పున:ప్రారంభించుకుందామన్నారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆలయ ప్రారంభోత్సవానికి హాజరై సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి రానున్న మన్సిపాలిటీ ఎన్నికల్లో ములుగులో 20వార్డులు గెలుచు కోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కష్టపడ్డ ప్రతీ ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని, పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి, పంచాయతీరాజ్ రాష్ట్ర డైరెక్టర్ బైరెడ్డి భాగవాన్ రెడ్డి, మండల, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

మహిళా సంఘాల స్టాల్స్ ప్రారంభించిన మంత్రి సీతక్క

ములుగు, మల్లంపల్లి మండలాల్లో రాష్ట్ర మంత్రి సీతక్క పలు మహిళా సంఘాల స్టాల్స్ ప్రారంభించారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఇంచర్ల ఎర్రిగట్టమ్మ వద్ద ఏర్పాటు చేసిన టీ స్టాల్, జంగాలపల్లి క్రాస్ వద్ద బొంగు చికెన్, నాటు కోళ్ల అమ్మకం, కూరగాయలు, పండ్లు విక్రయించే స్టాల్స్ ను మంత్రి సీతక్క ప్రారంభించారు. స్వయంగా మేడారం జాతర భక్తులకు టీ అందజేశారు. జాతరతో పాటు అన్ని ప్రధాన రూట్లలో మహిళా సంఘాల చేత స్టాల్స్ ఏర్పాటు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళలు స్వయం ఉపాధితో బలోపేతం కావాలని, జాతర వంటి పెద్ద అవకాశాలను ఆదాయ వనరులు గా మార్చుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. అదేవిధంగా జాకారంతోపాటు, మల్లంపల్లి మండల కేంద్రంలో సైతం పలు స్టాల్స్ ప్రారంభించిన మంత్రి వ్యాపారంలో మంచి ఎదుగుదల సాధించాలని సూచించారు. అనంతరం మల్లంపల్లి సమీపంలోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్పై నిర్మిస్తున్న నూతన బ్రిడ్జిని పరిశీలించిన మంత్రి సీతక్క ఎన్హెచ్ అధికారులతో మాట్లాడారు. మేడారం జాతర నేపథ్యంలో ట్రాఫిక్ పెరుగుతోందని, అందుకు తగ్గట్లుగా బ్రిడ్జి పనులు పూర్తిచేసి జాతరకు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి, డీఆర్డీవో శ్రీనివాస్ రావు, ఏడీ గొట్టె శ్రీనివాస్, డీపీఎం గడ్డం శ్రీనివాస్, ఏపీఎం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

19న సీఎం టూర్ సక్సెస్ చేయాలి : రాష్ట్ర మంత్రి సీతక్క

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!