సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను సందర్శించిన భూపాలపల్లి ఎస్పీ
కాటారం, డిసెంబర్ 13 (తెలంగాణ జ్యోతి): రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చిట్యాల గ్రామపంచాయతీ పోలింగ్ స్టేషన్ ను భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల నియమావళిని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు అభ్యర్థులు, రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలందరూ పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని ఎస్పీ కోరారు.






