బుర్ర వాగుపై రాకపోకల నిలిపివేత
కాటారం ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : కాటారం, మహా ముత్తారం మండలం రహదారి మధ్యలో గల బుర్ర వాగు పై రాకపోకలు నిలిపివేసినట్లు కాటారం తహసీల్దార్ కే నాగరాజు తెలిపారు. కాటారం మండలం పోతుల వాయి గ్రామ సమీపంలోని బుర్ర వాగు కాజువే లో లెవెల్ కల్వర్టు వద్ద ఫీటు ఎత్తు తో వరద నీటి ప్రవాహం ఉన్నందున రాకపోకలు నిలిపి వేసినట్లు వివరించారు. కాటారం వైపు, మహా ముత్తారం వైపు రాకపోకలు కొనసాగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవా లని ఆయా గ్రామ పంచాయితీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు, ప్రయా ణికులు వరద నీటి ప్రవాహంలో దాటవద్దని సూచించారు. నీటి ప్రవాహం లోతుకు వెళ్లడం, చాపలు పట్టడం ఇతరత్రా కార్యక్రమాలు ఏవి చేపట్టవద్దని తాసిల్దార్ సూచించారు.