శ్రీ అభయాంజనేయ స్వామి జయంతి మహోత్సవాలు
– భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు.
వెంకటాపురం నూగురు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లోని గ్రామ, గ్రామాన శ్రీ అభయాంజనేయ స్వామి జయంతి మహోత్సవాలను నిర్వహిం చేందుకు ఆలయ కమిటీలు విస్తృతమైన ఏర్పాట్లు నిర్వహిస్తు న్నారు. స్వామివారి జయంతి మహోత్సవాలు, భక్తి రస కార్యక్ర మాల సందర్భంగా స్వామి వారి విగ్రహాలకు, మండపాలకు ఆకర్ష నీయంగా అలంకరణ పనులను ఉత్సవ కమిటీలు వేగవంతంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 22వ తేదీ గురువారం నిర్వహించ నున్న స్వామి వారి జయంతి మహోత్సవాలు సందర్భంగా పంచామృత అభిషేకము, సహస్ర నామార్చనతోపాటు, సింధూర పూజ, నాగవల్లి దళార్చన, మరియు తెల్ల జిల్లేడు, పుష్పార్చన పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా మండపాల వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిం చేందుకు వేగవంతం చేశారు. వెంకటాపురం మండల కేంద్రంలోని మంగపే ట రోడ్డు, వెంకటాపురంలోని శివాలయం వద్ద గల శ్రీ అభయాంజనేయ స్వామి వారి భారీ విగ్రహాన్ని అలంకరించడం తోపాటు ముమ్మర ఏర్పాట్లు చేశారు.