చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

On: January 7, 2026 4:13 PM

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

– బిట్స్​ ప్రిన్సిపల్స్​ రజినీకాంత్​, కవిత

– ఖమ్మంలో జరిగిన కరాటే పోటీల్లో 13మంది చిన్నారులకు గోల్డ్​ మెడల్స్​

ములుగు, జనవరి7, తెలంగాణ జ్యోతి : విద్యార్థులు చదువుతోపాటు క్రీడాల్లోనూ రాణించాలని బాలాజీ ఇంటిగ్రేటెడ్​ విద్యాసంస్థల ప్రిన్సిపల్స్​ కొలగాని రజినీకాత్​, గిరిగాని కవిత పిలుపునిచ్చారు. రెండు రోజుల క్రితం ఖమ్మంలో వరల్డ్ ఫునకోషి షోటోకాన్ కరాటే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ములుగుకు చెందిన బిట్స్​ స్కూల్​లో చదువుతున్న 13మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్​ మెడల్స్​ సాధించారు. బుధవారం విద్యార్థులను ప్రిన్సిపల్స్​, ఉపాధ్యాయు లు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్నారులకు వ్యక్తిగత రక్షణ కోసం కరాటే నేర్పిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. వివిధ యాక్టివిటీస్​తోపాటు చదువుల్లోనూ రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సాహాన్నందించాలన్నారు. కరాటేతో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంపొందు తుందని, విద్యార్థుల్లో శారీరక, మానసిక ఎదుగుదల సాధ్యమవు తుందన్నారు. గోల్డ్​ మెడల్​ సాధించిన విద్యార్థులు లాస్య, ఆరాధ్య, హాసిని, అచ్యుత్ కిరణ్, అకుల్ చైతన్య, నవనీత్, సాత్విక్, స్నిగ్ధ, విగ్నేష్​ విహాన్​, సిరిక, దివ్య, రియాన్షిక, ఆదిత్యలను బిట్స్​ విద్యాసంస్థల చైర్మన్​ ఎ.రాజేంద్రప్రసాద్ రెడ్డి, ట్రెజరర్​ వనజ, అబ్‌సర్వర్​ శ్రీధర్​, ఉపాధ్యాయులు అభినందించారు. రాబోవు రోజుల్లో మరిన్ని కాంపిటేషన్స్​కు విద్యార్థులను సమాయత్తం చేస్తామని ప్రిన్సిపల్స్​ స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!