అక్షరాయుధంతో సమాజాన్ని మార్చిన వీరవనిత సావిత్రిబాయి పూలే
కన్నాయిగూడెం, జనవరి 03 (తెలంగాణ జ్యోతి): మండలంలోని గుర్రేవుల పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఉపాధ్యాయులు ఘనంగా నివాళులర్పించారు. మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం అక్షరాయుధంతో పోరాడిన మహోన్నత వీరవనిత సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఆమె ఆశయాలను నేటి మహిళలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాపయ్య, వేణు గోపాల్, పీఈటీ కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు.






