ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా ఇసుక క్వారీలు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా ఇసుక క్వారీలు నిర్వహిస్తున్నారని జిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి ఆరోపించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో గొండ్వానా సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు పూనెం ప్రతాప్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి పాల్గొని మాట్లాడుతూ పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని నూగూరు వెంకటాపురం మండలంలో వివిధ ఆదివాసి గ్రామాల్లో ఇసుక క్వారీలు ఫైలు చేస్తూ (డిఎల్ఎస్సి) నిర్వహించకుండా ఇసుక ర్యాంపుల కార్య నిర్వహణలు జరుపుతు న్నారన్నారు. సంబం ధిత అధికారులు సైతం ఏజెన్సీ ప్రాంత చట్టాలను పాతర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ఇసుక సొసైటీల పేరుతో గిరిజనులకు అన్యాయం చేస్తున్నా రని, పట్టా భూముల క్వారీలకు ఎటువంటి సర్వేలు నిర్వహించకుండా అనుమతులు ఇస్తున్నా రని ఇది రాజ్యాంగాన్ని కూని చేయటమేనని అన్నారు. ఏటూర్ నాగారం (ఐటిడిఏ) వ్యాప్తంగా పట్టా భూముల పేర్లతో అక్రమంగా ఇసుక క్వారీలకు అనుమతులు ఇస్తున్నారని ఇప్పటి వరకు పట్టా భూముల్లో ఇసుకను మేటలను తొగించి ఎంత భూమి సాగు చేశారని ప్రభుత్వాన్ని నిలదీశారు.పట్టా భూములకు ఇసుక మేటలు తొలగిపులకు అనుమతులు ఇవ్వాలంటే మరల వ్యవసాయ అభివృద్ధికి అనుకూలంగా ఉండే భూములకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు అందవలసిన ఫలాలు గిరిజనేతరుల మాఫీయా చేతులకు వెళ్తున్నాయని, ఇసుక ర్యాంపులో బినామీ వ్యవస్థను నిర్మూలించే విధంగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గొండ్వానా సంక్షేమ పరిషత్ యువత నరేష్,చంటి, రవి తదితరులు ఉన్నారు.