ముప్పనపల్లి గ్రామంలో రహదారి శుభ్రత పనులు
కన్నాయిగూడెం, జనవరి 21 (తెలంగాణ జ్యోతి): మేడారం జాతరకు వెళ్లే ప్రధాన మార్గంలో వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముప్పనపల్లి గ్రామంలో రహదారి శుభ్రత పనులు చేపట్టారు. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ నుంచి పోచమ్మ గుడి వరకు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించేందుకు ట్రాక్టర్–డోజర్ సహాయంతో రహదారి ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిప్పనపల్లి లక్ష్మయ్య, వార్డు సభ్యులు విజయ్, నవీన్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.






