కన్నాయిగూడెం ఆశ్రమ పాఠశాలలో పూలే వేడుకలు
కన్నాయిగూడెం, జనవరి 03 (తెలంగాణ జ్యోతి): మండలంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం సావిత్రి బాయిపూలే చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియా డుతూ, ఆమె ఆశయాలను విద్యార్థులు ఆచరణలోకి తీసుకురావాలని ఉపాధ్యా యులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.






