అనుమతి పొందిన తర్వాతనే ప్రచార సామాగ్రి ముద్రించాలి

అనుమతి పొందిన తర్వాతనే ప్రచార సామాగ్రి ముద్రించాలి

  •  ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఐటీడీఏ పీవో అంకిత్.

ములుగు ప్రతినిధి : అనుమతి పొందిన తర్వాతనే ప్రచార సామాగ్రి ముద్రించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఐటీడీఏ పీవో అంకిత్ తెలిపారు.బుధవారం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ డిఎస్ వెంకన్నతో కలసి ఎన్నికల ప్రక్రియలో బాగంగా ప్రచారం కొరకు ముద్రించే కరపత్రాలు, పోస్టర్స్ తదితర అంశాలలో తీసుకోవాల్సిన అనుమతులపై ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ప్రింటింగ్ చేయించే ప్రచార సామాగ్రి, ఫ్లెక్సీ లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నేతృత్వంలోని మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ద్వారా ముందస్తు అనుమతి పొందాలని, ప్రచురించే ప్రచార సామాగ్రి ప్రింటింగ్ ప్రెస్ పేరు, చిరునామా, సెల్ నెంబర్, ప్రచురణల సంఖ్య, ప్రచురించే అభ్యర్థి పేరు, చిరునామా వివరాలు తప్పని సరిగా అట్టి ప్రచార సామాగ్రి పై ప్రచురించాలని తెలిపారు. ప్రచురించవలసిన వివరాలకు సంబంధించిన మ్యాటర్ ను నిర్ణీత ప్రోఫార్మలలో సమర్పించాలని, అట్టి వాటిని ఎం.సి.ఎం.సి. కమిటీ పరిశీలించి 24 గంటలలోగా అనుమతించడం గాని,తిరస్కరించడం గాని జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 127-A ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ములుగు తహసిల్దార్ విజయభాస్కర్, జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్, ఫ్లెక్సీ దుకాణాల యజమానులు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం తహశీల్దార్ సంధ్యారాణి ఎన్నికల సిబ్బంది విజయ్ కుమార్, అనిస్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment