ప్రవళిక ది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యనే…?

Written by telangana jyothi

Published on:

ప్రవళిక ది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యనే…?

  •  ప్రజా సంఘాల నాయకుడు పీక కిరణ్ డిమాండ్

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: హైదరాబాద్ లోని అశోక్ నగర్ బృందావన్ హాస్టల్ లో నిరుద్యోగ విద్యార్థినీ ప్రవళిక మృతి చాలా బాధాకరమని, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ బోర్డు వైఫల్యం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో విద్యార్థి, నిరుద్యోగల ఆత్మహత్యలు, ప్రవళిక ది ఆత్మహత్య కాదు ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య గా శనివారం కాటారంలో పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడిన ప్రజా సంఘాల నాయకుడు పీక కిరణ్ ధ్వజమెత్తారు. ప్రభుత్వం తన కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేశియ ప్రకటించాలని డిమాండ్ చేశారు. తన కుటుంబానికి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, తక్షణమే పరీక్షల తేదీలను ప్రకటించాలని, లక్షలాది మంది నిరుద్యోగల జీవితాలని నాశనం చేస్తున్న టిఎస్పిఎస్సి బోర్డు చైర్మన్ తో సహా సభ్యులను తొలగించి , కమీషన్ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం కొత్త సభ్యులని నియమించాలని సూచించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలి, డీ ఎస్ సీ పోస్టుల సంఖ్యను ముఖ్యమంత్రి అసెంబ్లీ లో ప్రకటించిన విధంగా 13500 కు పెంచాలి.(బ్యాక్ లాగ్ పోస్టులు కాకుండా అదనంగా ), పరీక్షల రద్దుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యత వహించి పరీక్షలు రాసిన అభ్యర్థులకు మూడు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని పీక కిరణ్ డిమాండ్ చేశారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now