ప్రశాంతంగా నూతన సంవత్సరం వేడుకలు
వెంకటాపురం, జనవరి 1, తెలంగాణ జ్యోతి : నూతన సంవత్సరం వేడుకలు మత్తు, అతి వేగం, రోడ్లపై హంగామా లేకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా శాంతియుతంగా ముగిసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ములుగు జిల్లా పాలనా అధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ చేపట్టిన అవగాహన కార్యక్రమాల వల్ల ప్రజలు క్రమశిక్షణతో వేడుకలు జరుపుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిడెం మోహన్ రావ్, వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ, జిల్లా, మండల పోలీస్ అధికారులను అభినందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి మండలికి కృతజ్ఞతలు తెలుపుతూ, వెంకటాపురం మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.






