ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు డి.
– ఇరువురి యువకులకు తీవ్ర గాయాలు.
– భద్రాచలం, వరంగల్ తరలింపు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఒంటిమామిడి గ్రామం సమీపంలో ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. వాజేడు మండలం చెరుకూరు గ్రామానికి చెందిన యాలం స్వామి, వెంకటాపురం మండలం చొక్కాల గ్రామానికి చెందిన సనుకొండ లక్ష్మీనరసు ల ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనగా ఈ ప్రమాదంలో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం మేరకు 108 అంబులెన్స్ లో వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు క్షతగాత్రులను తరలించారు. తలకు బలమైన గాయాలు తగలడంతో అపస్మార స్థితిలో ఉన్న ఇరువురిలో ఒకరిని వరంగల్ ఎంజీఎం కు, మరొకరిని భద్రాచలం ప్రభుత్వ వైశాలకు తరలించారు.
1 thought on “ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు డి.”