బొల్లారం, కృష్ణాపురం లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని, వాజేడు మండలం కృష్ణాపురం, బొల్లారం గ్రామాలలో సోమవారం ఉదయం పేరూరు, వాజేడు పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. గ్రామాలలోకి అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని, అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయా గ్రామస్తు లను కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గిరిజన సంక్షేమ పథకాలపై అవగాహనతో లబ్ధి పొందాలని ఈ సందర్భంగా కోరారు. గ్రామీణ యువత విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో ముందుకు సాగాలని కోరారు. ఆయా గ్రామాలలో నెలకొని ఉన్న సమస్యలను ఆయా శాఖల ద్వారా పరిష్కరించటం జరుగుతుందని తెలిపారు. బడి వయసు పిల్లలను పాఠశాలలకు పంపించాలని అవగాహన కల్పించారు అలాగే గ్రామాలలో గుడుంబా మహమ్మారిని తరిమి కొట్టాలని పోలీస్ శాఖ పిలుపునిచ్చింది .ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ఎల్లవేళలా గ్రామస్తులకు సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. బొల్లారంలో జరిగిన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో వాజేడు ఎస్సై వెంకటేశ్వరరావు, కృష్ణాపురంలో జరిగిన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో పేరూరు ఎస్సై రమేష్ ఆయా పోలీస్ స్టేషన్ల సివిల్ మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
2 thoughts on “బొల్లారం, కృష్ణాపురం లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం. ”