గుర్రెవుల సర్పంచ్ అభ్యర్థిగా నందిని నామినేషన్
కన్నాయిగూడెం, డిసెంబర్5, తెలంగాణజ్యోతి : స్థానిక సంస్థల ఎన్నికల మూడో విడత నామినేషన్లలో భాగంగా బీజేబీ పార్టీ గుర్రెవుల సర్పంచ్ అభ్యర్థిగా వాసంపెళ్లి నందిని (రమేష్) శుక్రవారం కన్నాయిగూడెం రైతు వేదికలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బాలరాం, జిల్లా ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్ల బుచ్చయ్య, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





