Mulugu | ములుగు జడ్పీ కార్యాలయంపై ఏసీబీ రైడ్
– రూ.25వేలు లంచం తీసుకుంటూ చిక్కిన సూపరింటెండెంట్
– నిందితునితోపాటు మరో ఉద్యోగినిపై ఏసీబీ కేసు నమోదు
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : సహ ఉద్యోగి అనే కనికరం లేకుండా లంచం అడిగాడు ఓ అధికారి. తనకు రావాల్సిన సెలవుల డబ్బల కోసం బిల్లు చేయాలని అడిగితే తనకు రూ.60వేలు లంచం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టగా బాధి తుడు ఏసీబీకి పట్టించిన సంఘటన ములుగు జిల్లా కేంద్రం లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగింది. అందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ సాంబయ్య మీడియాకు వెల్లడించారు. ములుగులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో గాదెగోని సుధాకర్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాడు. అదే కార్యాలయంలో వెంకటేష్ అనే ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే కొన్ని నెలలు మెడికల్ లీవ్ తీసుకున్న ఉద్యోగి తనకు రావాల్సిన మెడికల్ లీవుల జీతంకు సంబంధించి బిల్లులను సిద్ధం చేసి ఎస్టీవో కార్యాలయానికి సమర్పించాలని సూపరింటెండెంట్ కు విజ్క్షప్తి చేశాడు. అందుకు గాను సూపరింటెండెంట్ సదరు ఉద్యోగిని రూ.60వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మొదట సూపరింటెండెం ట్ కు రూ.20వేలు, మరో ఉద్యోగిని సౌమ్యకు అదనంగా రూ.5వేలు ఇవ్వాలని తెలిపాడు. మిగిలిన రూ.40 వేలు బిల్లు సాంక్షన్ అయ్యాక ఇవ్వాలని ఒప్పందం కుదుర్చు కున్నారు. న్యాయంగా తనకు రావాల్సిన డబ్బులకు సంబంధిం చి బిల్లు చేయమంటే లంచం అడగడంపట్ల విసిగిపోయిన ఉద్యోగి వెంకటేష్ వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. మంగళవారం ములుగు జడ్పీ కార్యాలయంలో రూ.25వేల లంచం తీసుకుంటుండగా సూపరింటెండెంట్ జి.సుధాకర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకు న్నారు. సుధాకర్ తోపాటు ఉద్యోగిని సౌమ్యను అదుపులోకి తీసుకొని విచారించారు. ప్రత్యేకంగా కెమికల్స్ పరీక్షలు నిర్వహించి లంచం తీసుకోవడాన్ని ధృవీకరించుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి రూ.25వేలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. బుధవారం వారిని ఏసీబీ కోర్టులో హాజరుపరుచనున్నట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఉద్యోగికి నిజాయితీగా పని చేయాల్సిన ఉద్యోగులు సాటి ఉద్యోగి వద్ద లంచం తీసుకోవడంతో వారిని అరెస్ట్ చేశామ న్నారు. విచారణ కొనసాగుతుందన్నారు. కాగా, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1064కు గానీ, లేదా 9440446106 నెంబరులో సంప్రదించవచ్చని తెలిపారు. ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.