సరస్వతి పుష్కరాలపై కాలేశ్వరంలో మంత్రి సమీక్ష సమావేశం
కాటారం, తెలంగాణ జ్యోతి : ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బుధవారం (నేడు) నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు మంథని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చీమల సందీప్, మంత్రి పిఏ ఆకుల చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షే త్రమైన కాలేశ్వరంలో ఉదయం 12 గంటలకు సరస్వతి పుష్కరాలకు సంబంధించి రివ్యూ కార్యక్రమంలో పాల్గొంటు న్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు బొమ్మపూర్, కాటారం, భూపాలపల్లి లలో పలు వివాహ శుభకార్యలలో, సాయంత్రం 5 గంటలకు కమాన్ పూర్ మండలం నాగారం (లింగాల) గ్రామంలో పెద్దమ్మ దేవాలయం ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.