మేడారం జాతర పనుల్లో వేగం పెంచాలి.

Written by telangana jyothi

Published on:

మేడారం జాతర పనుల్లో వేగం పెంచాలి.

– 75 కోట్ల రూపాయలతో జాతర అభివృద్ధి పనులు : మంత్రి సీతక్క.

తెలంగాణ జ్యోతి తాడ్వాయి డిసెంబర్25 : మేడారం జాతర పనుల్లో వేగం పెంచి,త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచా యతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ & స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. సోమవా రం మండలంలోని మేడారంలో సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకున్నారు. ముందుగా గోవిందరావు పేట మండలంలోని పసర వద్ద నున్న గుండ్ల వాగు బ్రిడ్జిని, దయ్యలవాగు సమీపం లో ఉన్న రోడ్డును చింతల్ క్రాస్ వద్ద రోడ్డు ను పార్కింగ్ స్థలాలను,ఊర ట్టం బ్రిడ్జినీ వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. చిలుకల గుట్ట,విఐపి పార్కింగ్ బస్ స్టాండ్ ను పరిశీలించి అధికారులకు దిశ నిర్దేశించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తులకు ఎలాం టి ఇబ్బందులూ లేకుండా ఏర్పాట్లు చెయ్యడం జరుగుతుందని, అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పనులు వేగవం తం చేసే విధంగా ఉండాలని అధికారులకు పలు ఆదేశాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గాష్ ఆలం,ఐటిడిఎ పి. ఓ.అంకిత్, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ పి. శ్రీజ,డిపిఓ వెంకయ్య,డిఎస్పీ రవీందర్,ఇఒ రాజేంద్రం,పూజారులు సంఘం అధ్యక్షుడు జగ్గారావు, మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దేవేందర్, మండల అధ్యక్షుడు అనంత రెడ్డి, జిల్లా సీనియర్ నాయకుడు లచ్చు పటేల్, సర్పంచ్ సునీల్ దోర,వివిధ శాఖల చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tj news

1 thought on “మేడారం జాతర పనుల్లో వేగం పెంచాలి.”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now