Brs is in shock | మంథని బిఆర్ఎస్ కు షాక్
- బిఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి చల్ల నారాయణ రెడ్డి రాజీనామా
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: బిఆర్ యస్ సీనియర్ నాయకులు, కాటారం పిఏసిఎస్ చైర్మన్ చల్ల నారాయణ రెడ్డి గురువారం భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గురువారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. 2017 కేసీఆర్ పిలుపు మేరకు బిఆర్ ఎస్ పార్టీలో చేరానన్నారు. అప్పటి నుండి పార్టీ కోసం అహర్నిశలు పని చేశానని , కాంగ్రెస్ కంచు కోటలో 2019లో బిఆర్ ఎస్ జెడ్పిటిసి నీ గెలిపించుకున్నానని తెలిపారు. అయినా సరైన గుర్తింపు లేదని, ప్రజా వ్యతిరేకత వున్న అభ్యర్థికి టికెట్ కేటాయించడం కలిచి వేసింది , అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నాను. మంథని ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో వుంటానని రెండు రోజుల్లో ప్రజలు , కార్యకర్తల అభీష్టం మేరకు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.