మహాత్మాజ్యోతీబాపూలే డిగ్రీ ధరఖాస్తులకు ఆహ్వానం
ములుగు ప్రతినిధి : మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల ములుగు 2025–26 విద్యా సంవ త్సరానికి విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సి.హెచ్. సునీత ప్రకటనలో తెలిపారు. ములుగుకు చెందిన మహిళా డిగ్రీ కళాశాల ప్రస్తుతము కాజీపేట మండలంలోని సోమిడిలో కొనసాగుతున్నదని, ఈ కళాశాలలో అడ్మిషన్ పొందడానికి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఏప్రిల్ 23 నుండి మే 5వ తేదీ వరకు ఆన్ లైన్లో ధరఖాస్థు చేసుకోవాలని కోరారు. ఎం జె పి డిగ్రీ కళాశాల సోమిడిలో విద్యార్థుల కోసం హెల్ప్ డెస్క్ ప్రారంభించడం జరిగిందని, పూర్తి వివరాలకోసం 9491685294 నెంబర్ లో సంప్రదించాలని ప్రిన్సిపల్ సునీత పేర్కొన్నారు