మాడుగుల బాపు శర్మ, పవన్ శర్మ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : కాళేశ్వరం లో అమ్మ భవాని కమిటీ ఆధ్వర్యంలో దేవి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తు న్నారు. దుర్గ భవాని అమ్మవారి వద్ద 6వ రోజు ఉదయం 11 గంటలకు కుంకుమ పూజ నిర్వహించారు.అనంతరం మధ్యా హ్నం 1.00 గంటలకు మాడుగుల భాపు శర్మ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాడుగుల పవన్ శర్మ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలందరికీ, దేవస్థానం కు వచ్చే భక్తులకు మహా అన్న ప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మ భవాని కమిటీ భక్తులు పాల్గొన్నారు.