నిజామాబాద్లో అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా అరెస్ట్
17 బైకులు స్వాధీనం
పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య
నిజామాబాద్, మార్చి18,తెలంగాణజ్యోతి:నిజామాబాద్లో అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య ఐపీఎస్ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. నార్త్ రూరల్ సీఐ బి. శ్రీనివాస్, నవీపేట్ ఎస్ఐ కె. శ్రీకాంత్ దర్యాప్తుతో గ్యాంగ్ను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులు షేక్ అర్బజ్ మయా, షేక్ ఆరిబ్ను అరెస్ట్ చేయగా, షేక్ రెహమాన్, అవేజ్, షేక్ ఇమ్రాన్, అబూ సమీర్ పరారీలో ఉన్నారు. రిసీవర్లుగా షేక్ అర్బాజ్ రెహ్మత్, సోన్ కాంబ్లె మనోజ్, షేర్ అలి షాదుల్ షేక్ ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 15 కేసులను ఛేదించి 17 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నవీపేట్ అయ్యప్ప టెంపుల్ వద్ద వాహనాల తనిఖీల్లో నిందితులు పట్టుబడగా, పరారీలో ఉన్న మరికొందరి కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.





