ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే ఇందిరమ్మ ప్రభుత్వం
– తల తాకట్టు పెట్టిన అప్పులు తీర్చుకుంటూనే సంక్షేమ ఫలాల అమలు.
– జిల్లాకు మరో వెయ్యి ఇండ్ల మంజూరు.
– రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
– ప్రతి పేద కుటుంబానికి గూడుతో పాటు పౌష్టిక హారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం.
– అర్హులందరికీ దశలవారీగా ఇల్లు మంజూరు.
– త్వరితగటిన ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలి.
– రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.
ములుగు ప్రతినిధి, జూన్ 11, తెలంగాణ జ్యోతి : ఇందిరమ్మ రాజ్యమంటే రాష్ట్రంలోని ప్రతి పేదవారికి ఇల్లు నిర్మించడమే లక్ష్యం అని, గత పాలకులు చేసిన అప్పులను తీర్చుకుంటునే తల తాకట్టు పెట్టయినా అప్పులను తీర్చుతూ సంక్షేమ ఫలాలను అమలు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రతి పేద కుటుంబానికి గూడుతో పాటు పౌష్టిక హారం అందించడమే ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తున్నదని, అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. బుధవారం ములుగు జిల్లా పర్యాటన లో భాగంగా జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హెలికాప్టర్ ద్వారా చేరుకున్న రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి , రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ లకు
భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్ పి శబరీష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్
రవి చందర్ తదితరులు పూల మొక్కలు అందజేసి సాదర స్వాగతం పలికారు.
అనంతరం ఇంచర్ల గ్రామంలోని ఇందిరమ్మ కాలనీ లో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజా, నిర్మాణ పనులను రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాంనాయక్, స్థానిక శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ డాక్టర్ శబరీష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ లతో కలసి 23 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేయడమే కాకుండా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇంచర్ల ఎం. ఆర్. ఫంక్షన్ హాలు లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 22 వేల 500 కోట్ల రూపాయలతో 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని లక్ష్యంతో ముందుకు సాగుతుందని, గతంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేసిందని అన్నారు. గత పది సంవత్సరాలుగా గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లో నిర్మించి ఇస్తామని పేదలకు సాకులు చెప్పి 10 సంవత్సరాల కాలంలో కేవలం 93 వేల ఇండ్లకు టెండర్లను పిలిచి 60 వేల ఇండ్లను మాత్రమే పూర్తి చేసిందని, గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందమైన బొమ్మలు చూపుతూ రెండుసార్లు ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చారని తెలిపారు. రాష్ట్రంలోని ఇందిరమ్మ ప్రభుత్వం సంవత్సర కాలంలోనే నాలుగున్నర లక్షల ఇండ్లను నిర్మించాలని లక్ష్యంతో ముందుకు సాగుతుందని, ములుగు నియోజక వర్గానికి 3 వేల ఇండ్లు మంజూరు కాగా ఐటీడీఏ కు మరో 1500 ఇండ్లు మంజూరయ్యాయని, తాను మరో వెయ్యి ఇండ్లను మంజూరు చేస్తున్నానని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో విడతల వారీగా ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందని, మొదటి దశలో ఇండ్లు మంజూరు కాని వారు నిరాశ చెంద వద్దని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధి దారులకు వెంటనే ఉచితంగా ఇసుక కోసం కూపన్లను అందజేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అటవీ శాఖ అధికారులు సైతం ఇండ్ల నిర్మాణ పనులను అడ్డుకోవద్దని అన్నారు. ఇండ్ల నిర్మాణ పనులు చేపట్టిన లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తి చేయాలని పనుల పురోగతిని బట్టి ప్రతి సోమవారం చెక్కులను అందించడం జరుగుతుందని అన్నారు. రానున్న రోజులలో జరగనున్న ఎన్నికలలో ప్రజలు తమకు అండగా ఉండాలని కోరారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి పేదలకు డబల్ బెడ్ రూమ్ లు అందిస్తామని మోసం చేశారని, నేడు ఇందిరమ్మ ప్రభుత్వం ఇండ్ల నిర్మాణ పనులను చేపట్ట డంతో దానిని ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు దృష్పప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పేదవాడికి నీడని అందించ డంతోపాటు కడుపునిండా తిండి తినడానికి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం, ఇచ్చిన హామీల న్నిటిని తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని వివరించారు.
జిల్లాను పూర్తిస్థాయిలో పర్యాటక ప్రాంతంగా మార్చడా నికి నిధులు కేటాయించడం జరిగిందని, 70 కోట్ల రూపాయలతో రామప్పలో పనులు చేపట్టడమే కాకుండా 30 కోట్ల రూపాయ లతో ఐలాండ్ అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి మహిళ మహిళా సంఘాలలో చేరి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని పొంది పలు రకాల వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఇక్కడి ప్రాంతంలోని మహిళలకు ఇతర ప్రాంతాలలో ఎంతో ప్రాచుర్యం పొందిన బొంగు చికెన్ పై శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని, పేదల గూర్చి ఆలోచించే ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు. భద్రాచలం శాసనసభ సభ్యులు తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ మంత్రి అనసూయ సీతక్క ములుగు జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడం ములుగు జిల్లాలోనే మా నియోజకవర్గంలోని రెండు మండలాలు కూడా జిల్లాతో పాటు అభివృద్ధి చెందుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇంతవరకు ఏ మంత్రి వెళ్ళని తెలంగాణ రాష్ట్రానికి మారుమూల ప్రాంతమైన ములుగు జిల్లాలోని టేకులగూడెం అనే చిన్న ప్రాంతంలో కూడా స్వయంగా మంత్రుల ద్వారా ఇందిరమ్మ గృహాల శంకుస్థాపన జరగడం ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు. గృహాలు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వమని ముఖ్యమంత్రి ఆశీస్సులతో ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ఇక్కడి ప్రజలకు భూములకు పట్టాలు లేకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని అదే విధంగా కనీస అవసరాలు కూడు గుడ్డ నీరు అందించాలని దీనిలో భాగంగానే ప్రతి పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టాలని ఉద్దేశంతో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టామని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారని , త్రాగునీటికి కోసం కష్టపడి ఏజెన్సీ ప్రజలను దృష్టిలో ఉంచుకొని కేవలం నూట నలభై గృహాలు ఉన్న చిన్న గ్రామానికి కూడా ప్రత్యేక వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి ఆ గ్రామానికి నీరు అందించిన ఈ ఘనత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికే దక్కుతుందన్నారు. తాను కూడా ఇందిరమ్మ గృహంలోనే విద్యను అభ్యసించానని, అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ప్రతి పేదవారకి ఇందిరమ్మ గృహాలు అందుతున్నాయని తెలిపారు. భద్రాచలం నియోజకవర్గలో 4500 గృహాలు మంజూరు అయ్యాయని ప్రతి పేదవాడికి పక్కా గృహం ఉండాలని ఉద్దేశంతో మరో అదనంగా 1000 గృహాలను ప్రభుత్వం మంజూరు చేసిందని రాబోయే కాలంలో ప్రజలు మళ్ళీ ప్రభుత్వానికి పట్టం కట్టాలని అన్నారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ మంజూరు, ఆయిల్ ఫాం ఫ్యాక్టరీ మంజూరు చేయడం, వీటితో పాటుగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం లో భాగంగా ములుగు జిల్లాకు అత్యధికంగా ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన మంత్రి సీతక్కకు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ములుగు జిల్లాకు దాదాపు 4,900 వరకు ఇందిరమ్మ గృహాలు మంజూరు అయ్యాయని , జిల్లాలోని ప్రతి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూరు ఇవ్వడం జరిగిందని, ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా ఎంపిక చేసిన అర్హుల జాబితా ప్రజల ముందు ఉంచామని కలెక్టర్ వివరించారు. 720 ఇందిరమ్మ గృహాలను పైలెట్ గ్రామాలలో నిర్మాణం మొదలు పెట్టామని, వాటిలో 613 గృహాలకు గ్రౌండింగ్ కూడా పూర్తయిందని, 400 గృహాలు బేస్మెంట్ స్టేజ్ పూర్తయిందని , వాటిలో 300 గృహాలకు బేస్మెంట్ బిల్ లక్ష రూపాయలు కూడా అందించడం జరిగిందని పేర్కొన్నారు. చాలామంది లబ్ధిదారులకు ఇందిరమ్మ గృహాల విషయంలో అనేక సందేహాలు ఉన్నాయని వాటి నివృత్తి కోసం గ్రామాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యంగా బిల్లుల విషయంలో ఆందోళన కూడా ఉండేదని మొదటి విడతలో బేస్మెంట్ లక్ష రూపాయల బిల్ మంజూరు అవడంతో లబ్ధిదారులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇందిరమ్మ గృహాల విషయంలో జిల్లా యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా పనిచేయడం జరుగు తుందని ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలను పాటిస్తూ లబ్ధిదారుల విషయంలో అర్హతల మేరకే ఎంపిక చేశామని చెప్పారు. లబ్ధిదారులకు కేవలం మూడు లేదా నాలుగు నెలల లోపే గృహ నిర్మాణం పూర్తవుతుందని, ఐదు లక్షల రూపాయల లోపు గృహ నిర్మాణం ఏ విధంగా చేయాలి అనే అంశాలపై కూడా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను మంత్రులు అందచేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావు, ఆర్డీవో వెంకటేష్, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.